Header Banner

ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..! అకౌంట్‌లోకి డబ్బులు..!

  Wed Jun 04, 2025 09:27        Politics

ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకానికి సంబంధించి పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రెండో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన రాయితీ డబ్బులపై క్లారిటీ ఇచ్చారు. సిలిండర్ బుక్ చేసుకున్న కొందరు లబ్ధిదారులకు రాయితీ డబ్బులు జమ కాలేదని.. కొన్ని సాంకేతిక కారణాలతోనే డబ్బులు రాలేదన్నారు. వీరందరికి త్వరలోనే సబ్సిడీ సొమ్మును బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి. అలాగే మూడో విడత ఉచిత సిలిండర్‌కు సంబంధించిన రాయితీ డబ్బులపై కీలక ప్రకటన చేశారు. మూడో సిలిండర్ రాయితీ డబ్బుల్ని ముందుగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ జరుగుతోందన్నారు.

ఎవరైనా కేవైసీ చేసుకోకపోయినా బ్యాంక్ అకౌంట్‌లో దీపం 2 పథకం కింద డబ్బులు జమ కావని.. వారు వెంటనే కేవైసీ పూర్తి చేసుకుంటే వెంటనే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తారన్నారు. అలాంటివారు వెంటనే గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. కొంతమందికి బ్యాంకు అకౌంట్‌లకు ఆధార్ లింక్ కాని కారణంగా డబ్బులు జమ చేయలేదంటున్నారు.. ఇది కూడా చెక్ చేసుకోవాలి అంటున్నారు. వీటిని గమనించి సరిచేసుకుంటే రాయితీ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు జమ అవుతాయంటున్నారు. దీపం పథకం కింద తొలి విడతకు సంబంధించి.. ఇంకా 15 లక్షల మందికి గ్యాస్‌ సిలిండర్ల రాయితీ అందించాల్సి ఉందని.. ఈ సమస్య కూడా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!



రాష్ట్రవ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం షాపులకు రావాల్సిన అవసరం లేదన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. డీలర్లే వారి ఇంటికి రేషన్ తెచ్చి ఇస్తారని.. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రజలు సరుకుల పంపిణీలో, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి రేషన్ షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరఫరా కంటే షాపుల ద్వారా పంపిణీ 60% ఎక్కువగా ఉందన్నారు. రేషన్ పంపిణీలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయని.. వెంటనే వాటిని సరిదిద్దామన్నారు. రేషన్ పంపిణీ 15వ తేదీ వరకు కొనసాగుతుందని..రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందని మరోసారి గుర్తు చేశారు.

మధ్యాహ్న భోజన పథకం గురించి క్లారిటీ ఇచ్చారు మంత్రి. ఈ నెల 12 నుంచి మధ్యాహ్న భోజనానికి బియ్యం పంపిణీ మొదలవుతుందన్నారు. పాఠశాలలకు నెల అవసరాలకు సరిపడా 25 కిలోల చొప్పున ప్యాకింగ్‌ చేసిన బియ్యాన్ని సరఫరా చేస్తామన్నారు. ధాన్యాన్ని పండించిన రైతుల చేతుల మీదుగానే బియ్యాన్ని స్కూళ్లకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రేషన్ తీసుకోని కార్డుదారులకు డీబీటీ ద్వారా నగదు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FreeGasSubsidy #GasSubsidyUpdate #LPGSubsidy #SubsidyNotReceived #SimpleSteps #MoneyInAccount